News July 14, 2024

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

image

TG: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ MLA హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గతంలో ఇదే డిమాండ్ భట్టి విక్రమార్క చేశారు. మీ ప్రకటనకు కట్టుబడి 1:100 చొప్పున ఎంపిక చేయాలి. గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలి. మెగా DSC, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు రూ.4వేలు భృతి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

image

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.

News March 30, 2026

గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్‌ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.

News March 30, 2026

75 ఏళ్ల వయసులో మహిళల విడాకులు.. భర్తల వయసు ఎంతంటే?

image

సిమ్లా(HP)లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు భర్తలకు విడాకులు ఇచ్చారు. రెండు ఘటనల్లోనూ భార్యల కంటే భర్తల వయసు(59, 39 ఏళ్లు) తక్కువ ఉండటం గమనార్హం. అలాగే పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారు. మొదటి కేసులోని జంట 1990లో పెళ్లాడగా 2010 నుంచి దూరంగా ఉంటోంది. రెండో కేసులో జంట 2008లో వివాహం చేసుకోగా 2021 నుంచి విభేదాలు మొదలయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సమ్మతితో విడిపోయారు.