News July 15, 2024
కామారెడ్డి: మానవత్వం చాటుకున్న రైల్వే ఎస్ఐ

కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని ప్రయాణికుడు ఫిట్స్ సమస్యతో బాధపడుతుండగా గమనించిన ఆయన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 7, 2026
NZB: ఖైదీలను కొట్టారని జైలు అధికారులపై వేటు..!

నిజామాబాద్ జిల్లా జైలర్ ఉపేందర్ను సస్పెండ్ చేస్తూ, మరో జైలర్ సాయి సురేశ్ను ADB జైలుకు బదిలీ చేస్తూ జైళ్ల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా జైలర్లిద్దరూ తమను తీవ్రంగా కొట్టారని వారం రోజుల క్రితం జైలులోని ఇద్దరు ఖైదీలు చాకలి రాజు, కర్నే లింగం జడ్జికి తెలపడంతో ఈ విషయంపై జైలు శాఖ అధికారులు జిల్లా జైలుకు వచ్చి విచారణ చేపట్టి డీజీపీకి నివేదిక ఇవ్వగా వేటు పడిందని తెలిసింది.
News January 7, 2026
నిజామాబాద్ అంగన్వాడీల్లో నియామకాల జాప్యం..!

నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీల్లో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,501 ప్రధాన కేంద్రాలతోపాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినప్పటికీ, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచర్, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు.
News January 6, 2026
NZB: నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.


