News July 15, 2024

విశాఖ: 130 కిలోమీటర్ల వేగంతో గరీబ్ రథ్..!

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(12740-12739) గరీబ్ రథ్ రైళ్ల వేగం పెరగనున్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్-విశాఖ, ఈ నెల 23 నుంచి విశాఖ-సికింద్రాబాద్ రైళ్లు ఎల్ హెచ్బీ బోగీలను మారనుండటంతో రైలు వేగం కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 120 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో వెళుతుండగా, ఇప్పుడు దాన్ని 130 కిలోమీటర్లకు పెంచనున్నట్లు సమాచారం.

Similar News

News January 12, 2026

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

image

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News January 12, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 12, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.