News July 15, 2024
విజయనగరం: గత రెండేళ్లలో జరిగిన అత్యాచారాలు ఎన్నంటే..!

రామభద్రపురంలో ఆదివారం 6నెలల చిన్నారిపై జరిగిన ఘటన తల్లుల గుండెల్ని పిండేస్తోంది.అయితే విజయనగరం జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారికి సంబంధించి 2022లో 179,2023లో 108 లైంగిక వేధింపులు కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత రెండేళ్లగా మైనర్లపై 57 అత్యాచారాలు జరిగినట్లు నివేదిక చెప్తోంది. ప్రేమ పేరుతో కొందరు మృగాళ్లుగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు బంధువులే తమ కామ వాంఛలకు ముక్కపచ్చలారని చిన్నారులను కాటేస్తున్నారు.
Similar News
News January 20, 2026
VZM: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళికి రాష్ట్ర స్థాయి పురస్కారం

ఎన్నికల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా రెవెన్యూ అధికారి, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళిను రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్-2025’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయనకు పురస్కారం అందజేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
News January 20, 2026
VZM: స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు క్యాలెండర్లను ప్రారంభించిన కలెక్టర్

గ్రామ-వార్డు సచివాలయాల శాఖను ‘స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు’గా నామకరణం చేసిన నేపథ్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ క్యాలెండర్లను రాబోయే రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాలకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జీఎస్డబ్ల్యూఎస్ అధికారి ఎంరోజా రాణి తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
News January 20, 2026
విజయనగరం కలెక్టర్కు అవార్డు

విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి, పూర్వ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీరి పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.


