News July 15, 2024

భోజనం చేశాక నడిస్తే లాభాలివే..

image

నడక ఆరోగ్యకరమైన అలవాటు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి భోజనం తర్వాత చాలా మంది నడిచేందుకు ఇష్టపడుతుంటారు. భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఓ డాక్టర్ వివరించారు. ‘భోజనం చేశాక 15 నిమిషాల తర్వాత నడవడం సురక్షితం. దీని ద్వారా జీర్ణవ్యవస్థ మరింత వేగంగా పనిచేస్తుంది. మానసిక స్థితి & నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో HbA1C 0.5% తగ్గుతుంది’ అని తెలిపారు.

Similar News

News November 3, 2025

రాష్ట్రంలో 225 ఉద్యోగాలు.. APPLY చేశారా?

image

TG: జిల్లా కోఆపరేటివ్​ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగుస్తుంది. HYD​, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్​ జిల్లాల్లో ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgcab.bank.in/

News November 3, 2025

నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తా: KTR

image

TG: కంటోన్మెంట్ నియోజకవర్గానికి CM రేవంత్ రూ.4 వేలకోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని KTR ఓ ఇంటర్వ్యూలో సవాలు చేశారు. నిరూపించలేకపోతే CM రేవంత్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News November 3, 2025

కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

image

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్‌లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.