News July 15, 2024
ధర్మవరం ఆర్టీసీ బస్సు దగ్ధం.. జిల్లావాసులకు గాయాలు
తెలంగాణ రాష్ట్రం మహాబూబ్ నగర్(D) బురెడ్డిపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం 15మంది గాయపడ్డగా వారిలో అనంతపురం జిల్లాకు చెందిన సంజీవ, సునీల్, గాయత్రిలు ఉన్నారు. వారు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News September 30, 2024
అనంతపురం: 46 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు
అనంతపురం జిల్లాలో మంచి పనితీరు కనబర్చిన 46 మంది పోలీసు సిబ్బందికి SP జగదీష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులను సకాలంలో కోర్టు ముందు హాజరుపరిచి శిక్షలు పడేలా, హత్యా కేసుల్లో యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు సహకరించడం, ఏటీఎం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేశారన్నారు.
News September 30, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి
తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
News September 30, 2024
వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం
తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.