News July 15, 2024

రీఛార్జ్ ధరలు పెంచినా మెరుగుపడని సేవలు!

image

జియో, ఎయిర్‌టెల్, VI ఇటీవల టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచినా యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ తెలిపింది. కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యను 89% మంది ఎదుర్కొంటుండగా, 38% మందికి తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మెట్రో నగరాల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య స్వల్పంగా తగ్గినట్లు సర్వేలో తేలింది.

Similar News

News December 25, 2025

ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

image

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు..

image

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.

News December 25, 2025

శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

image

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <>వీడియోను<<>> ఆమె షేర్ చేశారు. బెదిరింపు, అసభ్యకర మాటలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావని, చట్ట ప్రకారం కేసులు పెట్టొచ్చని అడ్వకేట్ అందులో హెచ్చరించారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు.