News July 15, 2024
RTC ఛైర్మన్గా డాక్టర్ వంశీకృష్ణ..?

అచ్చంపేట MLA వంశీ కృష్ణకు TG RTC ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. కేబినెట్లో అవకాశం లేకపోవడంతో ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. NGKL పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆయనకు అనుకూలంగా సీఎంకు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రకటించే అవకాశం ఉందని టాక్.
Similar News
News September 14, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News September 14, 2025
మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

తిరుపతి వేదకగా ఆదివారం ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.
News September 14, 2025
MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

జాతీయ మెగా లోక్ అదాలత్లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597