News July 15, 2024

ట్రంప్‌పై కాల్పులు.. నిందితుడిని చూసినా భయంతో వదిలేసిన పోలీస్?

image

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన చర్చనీయాంశమైన వేళ మరిన్ని కీలక వివరాలు వెలుగు చూశాయి. పెన్సిల్‌వేనియాలో ట్రంప్‌ను హతమార్చేందుకు ఓ భవనంపై నక్కి ఉన్న నిందితుడు క్రూక్‌ను కాల్పులకు ముందే ఓ పోలీస్ కనిపెట్టినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. భవనం పైకప్పువైపు ఆ అధికారి వెళ్లగా క్రూక్స్ రైఫిల్ చూపి బెదిరించడంతో వెనక్కు తగ్గినట్లు తెలిపింది. అనంతరం క్రూక్‌ ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డాడని పేర్కొంది.

Similar News

News November 13, 2025

మార్నింగ్ అప్డేట్స్

image

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

News November 13, 2025

రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

image

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.

News November 13, 2025

టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

image

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్‌లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్‌లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.