News July 15, 2024
ట్రంప్పై కాల్పులు.. ధ్రువ్ రాఠి ట్వీట్ వైరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరపడంపై యూట్యూబర్ ధ్రువ్ రాఠి స్పందించారు. ‘డొనాల్డ్ ట్రంప్ దాదాపు హత్యకు గురైన పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా సెమీ ఆటోమేటిక్ రైఫిల్ను పొందవచ్చు. అమెరికాలో ప్రతి సంవత్సరం 40,000 మంది కాల్పుల కారణంగా మరణిస్తున్నారు. అయినా దీనిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయుధ మాఫియాను నియంత్రించేందుకు ట్రంప్, బైడెన్ పెద్దగా కృషి చేయలేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 13, 2026
ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.
News January 13, 2026
ప్రభాస్ నన్ను వర్రీ కావద్దన్నారు: మారుతి

రాజాసాబ్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ తనకు సపోర్ట్గా నిలిచినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ‘మూవీ గురించి ఎక్కువ అప్డేట్గా ఉన్నది ప్రభాసే. నిరంతరం నాతో టచ్లో ఉన్నారు. వర్రీ కావద్దన్నారు. కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్కు చేరడానికి కొంత టైమ్ పడుతుందన్నారు. రీసెంట్గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా. ఆ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని అన్నారు’ అని మీడియా సమావేశంలో తెలిపారు.
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.


