News July 15, 2024

డిగ్రీలెందుకు? పంక్చర్ షాప్ పెట్టుకోండి: BJP MLA

image

MPకి చెందిన BJP MLA పన్నాలాల్ షాక్య ఇచ్చిన సలహాతో విద్యార్థులు కంగుతిన్నారు. ‘PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో రాష్ట్రంలోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈక్రమంలోనే MLA ‘నేడు PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. అయితే మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే జీవనోపాధికి పంక్చర్ షాప్ పెట్టుకోండి’ అని అన్నారు.

Similar News

News November 15, 2025

రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.

News November 15, 2025

యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

image

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్‌ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.

News November 15, 2025

తెలంగాణలో 26 అధునాతన గోదాముల ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో పంట నిల్వకు గోదాముల కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో 26 అధునాతన గోదాములు నిర్మించాలని నిర్ణయించింది. నిల్వ చేసిన పంటకు ఎలుకలు, చీడపీడల బెడద లేకుండా, గాలి, వెలుతురు అవసరం మేరకు ఉండేట్లు వీటిని నిర్మించనున్నారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు AI వినియోగించి తూకం, నిల్వ విధానాన్ని సులభతరం చేయనున్నారు.