News July 15, 2024

గిరి ప్రదక్షణపై స్వచ్ఛంద సంస్థలతో సమావేశం

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2026

రూపాయికే ఎకరా.. చిన్న కంపెనీకి భారీ రాయితీనా: వైసీపీ

image

తర్లువాడలో సెమీకండక్టర్ యూనిట్‌కు ఎకరాకు రూపాయి చొప్పున 30 ఎకరాల భూమి కేటాయింపుపై YCP సందేహాలు వ్యక్తం చేసింది. ASIP టెక్నాలజీస్ లాంటి చిన్న ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత తక్కువ ధరకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. ఈ నిర్ణయంపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని వైసీపీ నేత అమర్‌నాథ్ SMలో డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్, టీడీపీ స్పష్టత ఇవ్వాలన్నారు.

News March 1, 2026

విశాఖలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు.. యువతే లక్ష్యం

image

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న పెందుర్తిలో 4 గ్రా. ఎండీఎంఏ స్వాధీనం కాగా, రెండు రోజుల క్రితం ఎంవీపీ పోలీసులు 2.23 గ్రా. యువకుడిని అరెస్ట్ చేశారు. గతేడాది నగర పరిధిలో గంజాయి, హ్యాష్ ఆయిల్ తదితరవి పట్టుబడగా వాటి విలువ రూ.5 కోట్లగా ఉంది. 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.

News March 1, 2026

విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

image

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.