News July 16, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓ ఖమ్మంకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాక
✓ మధిరలో సిపిఎం రాజకీయ శిక్షణ కార్యక్రమం
✓ నేలకొండపల్లిలో రైతులతో శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్
Similar News
News August 5, 2025
జిల్లా కలెక్టర్తో ఐటీడీఏ పీవో భేటీ

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఐటీడీఏ పీవో మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News August 5, 2025
‘జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం’

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రికి జర్నలిస్టులు పలు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
News August 5, 2025
భద్రాద్రిలో దారుణం.. యువకుడి సజీవ దహనం

భద్రాద్రి(D) గుండాల మండలంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. వెన్నెలబైలుకు చెందిన పర్సిక రాజు (35) తన బైకుపై తన పొలం వద్దకు వెళ్తుండగా, బైక్కు హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. దీంతో బైకుకు మంటలు చెలరేగి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.