News July 16, 2024
మార్టూరు: రాజుపాలెంలో కత్తితో దాడి

మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 2, 2025
ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.
News November 1, 2025
నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.
News November 1, 2025
ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం
పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ కర్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అన్నారు.


