News July 16, 2024
కాసేపట్లో స్పీకర్ను కలవనున్న BRS నేతలు

TG: రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ తమ ఎమ్మెల్యేల పట్ల ప్రొటోకాల్ పాటించట్లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో KTRతో సహా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కలవనున్నారు. నిన్న ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదంలో మాజీ మంత్రి <<13633194>>సబితా<<>> నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2026
NZB: వ్యభిచార గృహాలపై CCS టీం మెరుపు దాడి

నిజామాబాద్ CCS ఇన్ఛార్జి ఏసీపీ మస్తాన్వలి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యభిచార గృహాలపై మెరుపు దాడి నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యభిచార గృహాలపై రైడ్ చేశారు. నలుగురు విటులు, ఐదుగురు మహిళలను పట్టుకున్నారు. రూ.27,290 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ SHOలకు అప్పగించారు.
News January 9, 2026
తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


