News July 16, 2024
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ సీపీ శంకభద్ర బాగ్చి మంగళవారం పరిశీలించారు. సింహాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ విశ్వనాథన్, ఈవో శ్రీనివాసమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

విశాఖలో ఆపరేషన్ లంగ్స్లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.
News September 18, 2025
ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.
News September 18, 2025
ఆనందపురం: కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర గౌరి నాయుడు(40) గురువారం మధ్యాహ్నం కుసులవాడ తీగలవానిపాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకు తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.