News July 16, 2024
AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB

ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APకి 4.500 TMCలు, TGకి 5.414 TMCల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు స్పష్టం చేసింది.
Similar News
News November 10, 2025
ఆస్ట్రేలియాలో SM వాడకంపై ఆంక్షలు.. DEC నుంచి అమలు

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించనున్నట్లు ఆస్ట్రేలియా PM ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. వారి ఆన్లైన్ సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్-2024లోని ఈ కొత్త రూల్ డిసెంబర్ 10, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీంతో టీనేజర్లు FB, ఇన్స్టా, టిక్టాక్, X, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో అకౌంట్లు ఓపెన్ చేయడం, నిర్వహించడం చట్ట విరుద్ధం.
News November 10, 2025
చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
News November 10, 2025
దేశంలోనే శ్రీమంతురాలైన రోష్నీ నాడార్ గురించి తెలుసా?

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో 5స్థానంలో నిలిచిన రోష్నీ నాడార్కు సుమారు రూ. 2.84 లక్షల కోట్ల సంపద ఉంది. 27 ఏళ్లకే HCL CEO బాధ్యతలు చేపట్టిన ఆమె సంస్థను లాభాల బాట పట్టిస్తూ ధనిక మహిళల్లో ఒకరిగా ఎదిగారు. మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్నారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్ జాబితాల్లో చోటు దక్కించుకున్న ఆమె గతేడాది ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్ డె లా లీజియన్ డి-హానర్’ అందుకున్నారు.


