News July 17, 2024
‘ప్రజావాణి’ దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి: DGP

TG: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ‘ప్రజావాణి’ ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులను DGP జితేందర్ ఆదేశించారు. పీఎస్లలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. హిస్టరీ షీట్లను సమీక్షించాలని, ఆయుధాల లైసెన్స్ల జారీపై జాగ్రత్త వహించాలన్నారు. SC, STలు, మహిళలు, శాంతి భద్రతలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
Similar News
News January 23, 2026
బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.
News January 23, 2026
కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?
News January 23, 2026
BELలో 99 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు FEB 5, 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. Engg. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.17,500, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు రూ.12,500, ITI వారికి రూ.11,040 చెల్లిస్తారు. అప్రెంటిస్లుగా ఏడాది పూర్తి చేసుకున్నవారికి రాత పరీక్ష నిర్వహించి ట్రైనీ ఇంజినీర్లు, అడ్వాన్స్డ్ ట్రైనీస్గా నియమించుకుంటారు.


