News July 17, 2024

బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త
పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News November 5, 2025

గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

image

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

News November 5, 2025

GNT: ‘కపాస్ కిసాన్’ యాప్‌ ద్వారా సీసీఐకి విక్రయించాలి

image

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్‌ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.