News July 17, 2024
విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో అప్పికట్ల-నిడుబ్రోలు-చుండూరు స్టేషన్ల మధ్య 3వ లైన్కు సంబంధించిన నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని బయలుదేరే సమయాలు మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు గంటన్నర, రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.
Similar News
News September 19, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఢిల్లీ అధికారులు

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.
News September 19, 2025
విశాఖ: గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

వన్ టౌన్లో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ దంపతులను గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ జీడి బాబు తెలిపారు. బాధితులకు గోల్డ్ ఇస్తామని రూ.3 కోట్లు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులు దామోదర నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్లను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా వన్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయాలన్నారు.
News September 18, 2025
విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

విశాఖలో ఆపరేషన్ లంగ్స్లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.