News July 17, 2024

600 మంది విద్యార్థినీలకు ఒకటే మరుగుదొడ్డి!

image

నల్గొండ జిల్లాలోని సర్కారు పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 1250 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 600 మంది విద్యార్థినీలు, 15 మంది మహిళా టీచర్లు ఉన్నారు. వీరందరికీ ఒకటే మరుగుదొడ్డి ఉండడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

Similar News

News December 29, 2025

యాసంగి ప్రారంభంలోనే రైతన్నకు కష్టాలు!

image

అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీలో 5,64,678 ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా వేసిన నాట్లు ఏమాత్రం ఎదగకపోగా చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 29, 2025

మిర్యాలగూడ : ’44 ఏళ్ల తర్వాత కలిశారు’

image

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిదని వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.

News December 29, 2025

బకాల్‌వాడ: 44 వసంతాల ఆత్మీయ కలయిక

image

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిది వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.