News July 17, 2024

ఈక్విటీ మార్కెట్లకు సెలవు… MCX ట్రేడింగ్ ఎప్పుడంటే?

image

మొహర్రం సందర్భంగా ఈరోజు ఈక్విటీ, డెరివేటివ్ విభాగాల్లో ట్రేడింగ్‌కు ఎక్స్‌ఛేంజీలు సెలవు ప్రకటించాయి. ఇన్వెస్టర్లు ఈరోజు స్టాక్స్, బాండ్లను కొనుగోలు/విక్రయించడానికి అవకాశం ఉండదు. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజీలోనూ మార్నింగ్ సెషన్ అందుబాటులో ఉండదు. MCX తిరిగి సాయంత్రం ప్రారంభమవుతుంది. సా.గం.5 నుంచి రాత్రి గం.11.30 వరకు ట్రేడింగ్ ఉంటుంది. పెట్రోల్, గోల్డ్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి.

Similar News

News April 3, 2026

విద్యార్థులకు అలర్ట్.. 8 నుంచే పరీక్షలు

image

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA2) పరీక్షల షెడ్యూల్ మారింది. APR 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని భావించినా ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 1-7తరగతుల వారికి 9Am-11.30Am వరకు, 8వ తరగతికి 9Am-11.45Am, నైన్త్ విద్యార్థులకు 9Am-12Pm వరకు పరీక్షలు జరుగుతాయి. APR 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.

News April 3, 2026

IPL: అభిషేక్ శర్మకు ఫైన్

image

అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన SRH బ్యాటర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్‌ విధించినట్లు IPL ఓ ప్రకటనలో తెలిపింది. KKRతో నిన్న జరిగిన మ్యాచులో <<19551503>>అభిషేక్ క్యాచును<<>> వరుణ్ చక్రవర్తి అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టడానికి ముందు బాల్ నేలను తాకినట్లుగా కనిపించడం వివాదాస్పదమైంది.

News April 3, 2026

వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న మెడిసిన్ రేట్లు

image

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరిగే జాబితాలో మందులు కూడా చేరుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.