News July 17, 2024
4 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి: భట్టి

TG: సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. 4 నెలల్లో గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వెలుపల తొలిసారి చేపడుతున్న ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలన్నారు.
Similar News
News April 10, 2026
IPL: చరిత్ర సృష్టించారు

KKRతో మ్యాచ్లో LSG ప్లేయర్లు ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సక్సెస్ఫుల్ <<19611855>>రన్ ఛేజ్లో<<>> 8th వికెట్ లేదా అంతకంటే దిగువన అత్యధిక భాగస్వామ్యం(54*) నమోదు చేసిన జోడీగా నిలిచారు. ఇందులో ముకుల్ ఒక్కరే 52 రన్స్ చేశారు. అలాగే లక్ష్య ఛేదనలో ఏడో నంబర్/దిగువన బ్యాటింగ్కు వచ్చి హయ్యెస్ట్ సిక్సర్లు(7) బాదిన ప్లేయర్గా బ్రావో సరసన ముకుల్ చేరారు.
News April 10, 2026
RBI కొత్త ప్రతిపాదన.. రూ.10,000+ పంపిస్తే!

ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ₹10వేలకు మించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రిసీవర్ ఖాతాలో ఆ నగదు జమ అయ్యేందుకు ఒక గంట సమయం పట్టేలా రూల్ తేనుంది. ఈలోగా మనీ పంపినవారు వద్దనుకుంటే ఆ బదిలీని రద్దు చేయవచ్చు. బ్యాంకులూ అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్ చేస్తాయి. మర్చంట్, రికరింగ్, చెక్ పేమెంట్స్కు ఇది వర్తించదు. దీనిపై మే8 వరకు RBI అభిప్రాయాలు స్వీకరించనుంది.
News April 10, 2026
రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే..

రాగుల్లో ప్రొటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ C, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రోజూ ఈ జావను తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
#ShareIt


