News July 17, 2024

కర్నూలు జిల్లాలో మరోసారి చిరుత పులి పంజా

image

కర్నూలు జిల్లా కోసిగిలో బుధవారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాముడు అనే వ్యక్తి గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గమనించిన రాముడు కేకలు వేయడంతో పారిపోయింది. కాగా చిరుత దాడిలో ఒక గొర్రెపిల్ల మృతిచెందింది. చిరుత పులి తరచూ దాడులు చేస్తోందని, తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 11, 2026

కర్నూలు: నెల రోజుల క్రితం రూ.260.. నేడు రూ.300

image

కర్నూలులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం కేజీ రూ.260 ఉండగా నేడు రూ.300 పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్‌ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతి, కనుమ రానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 70% తెలంగాణ నుంచి బ్రాయిలర్ కోళ్లు సరఫరా అవుతున్నాయి. 25% కర్ణాటక నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 5% మాత్రమే జిల్లాలో కోళ్ల ఉత్పత్తి అవుతోంది.

News January 11, 2026

కర్నూలు: ‘ఆయన వల్లే జగన్‌కు 11 సీట్లు’

image

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని MLC బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.

News January 11, 2026

సజ్జల తీరుతోనే జగన్‌కు 151 నుంచి 11 సీట్లు: ఎమ్మెల్సీ బీటీ

image

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.