News July 17, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు

డీఎస్సీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఇఓ రవీందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్లోని ఫాతిమా విద్యాలయం క్రిస్టియన్ పల్లి, JPNCE ధర్మాపూర్లో ఆన్లైన్ బేస్డ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష 13 రోజులో రోజుకు 2 సెక్షన్లు జరుగుతుందని, ఉ.9 గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ వెంట తీసుకురావాలన్నారు.
Similar News
News November 3, 2025
MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 3, 2025
కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News November 3, 2025
హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.


