News July 17, 2024
బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?

బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందనేది అపోహ మాత్రమేనని BBC పేర్కొంది. బల్లుల్లో మనిషిని చంపేంత విషం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయంది. అయితే బల్లి పడిన ఆహారాన్ని తీసుకున్నామనే అలర్జీ వల్లే వాంతులు, తలనొప్పి వస్తాయంది. ఈ సమస్యను మందులతో తగ్గించుకోవచ్చని వివరించింది. బల్లుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, అవి లేకపోతే కీటకాల సంఖ్య పెరిగి పరిస్థితి భయానకంగా మారుతుందని తెలిపింది.
Similar News
News December 30, 2025
2025లో వీళ్లే టీమ్ ఇండియా స్టార్లు: అశ్విన్

భారత మాజీ క్రికెటర్ అశ్విన్ 2025లో తన దృష్టిలో బెస్ట్ ప్లేయర్లు ఎవరో ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. వరుణ్ చక్రవర్తిని ‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేశారు. 2026 T20 వరల్డ్కప్లో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అలాగే అభిషేక్ శర్మను ఈ ఏడాది అత్యుత్తమ బ్యాటర్ అని, నెక్స్ట్-జనరేషన్ Xఫాక్టర్గా అభివర్ణించారు. ఇక రోహిత్, కోహ్లీ ODI వరల్డ్కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.
News December 30, 2025
ప్రసార భారతిలో ఉద్యోగాలు

<
News December 30, 2025
ఆర్థిక ఇబ్బందుల పరిష్కారం కోసం..

ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి పండితులు ఓ పూజను సూచిస్తున్నారు. ‘రాత్రి వేళలో కలశంపై కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి, అందులో నీరు, గరిక, నాణెం వేయాలి. బియ్యం ఉన్న పళ్లెంలో స్ఫటిక శ్రీయంత్రాన్ని ఉంచి, దీపంతో పూజించాలి. 10 నిమిషాల ధ్యానం, శ్రీసూక్త పారాయణంతో సంపద పెరుగుతుంది. పేదలకు అన్నదానం, దివ్యాంగులకు ఆర్థిక సాయం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో సుఖసమృద్ధులు వెల్లివిరుస్తాయి.


