News July 17, 2024

ఎన్‌కౌంటర్‌లో లక్ష్మణ్ ఆత్రం మృతి

image

మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన <<13649598>>ఎన్‌కౌంటర్‌లో<<>> తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 6 గంటల పాటు కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. అందులో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఇక కాల్పుల్లో గాయపడ్డ జవాన్‌ను చికిత్స కోసం నాగ్‌పుర్‌కు తరలించారు.

Similar News

News March 26, 2026

మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

image

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

News March 26, 2026

బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

image

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.

News March 26, 2026

బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

image

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.