News July 18, 2024
రుణమాఫీ సంబరాలు: కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి

రుణమాఫీ పొందిన రైతులతో రైతు వేదికలలో సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై బుధవారం అయిన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 13, 2026
నల్గొండ: ‘ప్రజావాణి’ ప్రారంభం

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సోమవారం నుంచి కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను యథావిధిగా స్వీకరిస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 13, 2026
ఎంజీయూ B.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎంజీయూ పరిధిలోని B.Ed సెమిస్టర్-3 రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం ఎగ్జామినర్ల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-A కాలేజీలకు, 19, 20 తేదీల్లో గ్రూప్-B కాలేజీలకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
News February 13, 2026
నల్గొండలో విషాదం.. డీసీఎం ఢీకొని కానిస్టేబుల్ మృతి

చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మునుగోడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధులను ముగించుకుని నకిరేకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.


