News July 18, 2024
పాక్కు టీమ్ఇండియా వెళ్తుందా? రేపే స్పష్టత?

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్కు టీమ్ ఇండియా వెళ్తుందా? లేదా? అనే దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. శ్రీలంకలో రేపు జరగనున్న ICC వార్షిక సమావేశంలో దీనిపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రస్తుతం BCCI సెక్రటరీగా ఉన్న జై షా ICC ఛైర్మన్ అవుతారా? అనే దానిపై కూడా క్లారిటీ రానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే (NZ) ఉన్నారు.
Similar News
News April 2, 2026
30రోజుల్లో 10 T20లు.. టీమ్ఇండియాకు బిజీ షెడ్యూల్

IPL తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10 టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్తో 2 టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత జులై 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. మళ్లీ జులై 23, 25, 26వ తేదీల్లో జింబాబ్వేతో ఆడనుంది. ఇక IPLలో రాణించే యువ క్రికెటర్లు ఈ సిరీసులకు సెలెక్ట్ అయ్యే అవకాశముంది.
News April 2, 2026
జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

AP: అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, అందుకే వింత పేరు తీసుకొచ్చారని CM CBN విమర్శించారు. మావిగన్ పేరు పెట్టాలనడం ద్వేషానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అమరావతిపై ఆయన వైఖరి మారదని స్పష్టమైందని కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో అన్నారు. రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని, తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో పాల్గొంటానని చెప్పారు.
News April 2, 2026
ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.


