News July 18, 2024
‘ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా, 2023 జూన్లో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం కనీస ఫీజు రూ.43వేలుగా ఖరారైంది.
Similar News
News November 10, 2025
ఏపీ టుడే

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.
News November 10, 2025
సఫారీలపై మన రికార్డు పేలవమే..

ఈ నెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రికార్డులు టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 సిరీస్లు జరగగా 8 సార్లు సఫారీలదే విజయం. ఇండియా 4 సార్లు గెలవగా, మరో నాలుగు సిరీస్లు డ్రాగా ముగిశాయి. చివరిగా ఆడిన సిరీస్ డ్రాగా ముగియడం భారత్కు ఊరటనిస్తోంది. కాగా WTC డిఫెండింగ్ ఛాంపియన్ను గిల్ సేన ఓడించాలంటే అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది.
News November 10, 2025
బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.


