News July 18, 2024
తిరుపతి: PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 20.
Similar News
News September 14, 2024
తిరుపతి: స్పా సెంటర్ పై పోలీసుల దాడి
తిరుపతిలోని శ్రీనివాసం వెనుక వైపు డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో ఓ లాడ్జీ పై ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జీ పైన ఉన్న 7 స్పా సెంటర్ పై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
SVU : పీజీ ఫలితాలు విడుదల
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ ( PG) LLM మొదటి సెమిస్టర్, జులైలో M.A, M.COM, M.SC నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News September 14, 2024
చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి
ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.