News July 18, 2024

చిత్తూరు: విద్యుత్ పోల్స్ మార్చండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తక్షణమే మార్పు చేయాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాల కురుస్తున్నాయని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు సైతం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Similar News

News September 14, 2024

తిరుపతి: స్పా సెంటర్ పై పోలీసుల దాడి

image

తిరుపతిలోని శ్రీనివాసం వెనుక వైపు డీబీఆర్ ఆసుపత్రి రోడ్డులో ఓ లాడ్జీ పై ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జీ పైన ఉన్న 7 స్పా సెంటర్ పై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

SVU : పీజీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఏప్రిల్ నెలలో పీజీ ( PG) LLM మొదటి సెమిస్టర్, జులైలో M.A, M.COM, M.SC నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 14, 2024

చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి

image

ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.