News July 18, 2024
నారా లోకేశ్ ట్వీట్.. స్పందించిన కర్ణాటక ఐటీ మంత్రి

AP: నాస్కామ్ను ఏపీకి ఆహ్వానించిన ఐటీ మంత్రి నారా లోకేశ్కు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘డియర్ లోకేశ్.. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ప్రతి సంస్థలోనూ ఏపీకే చెందిన సమర్థులకు, నిపుణులకు ఉద్యోగాలు రావాలని కోరుకోరా?’ అని ప్రశ్నించారు. నాస్కామ్ కర్ణాటకలోనే నిశ్చింతగా ఉండొచ్చని, వారికి ఇబ్బంది కలిగేలా తమ ప్రభుత్వం ఏ పనీ చేయదని హామీ ఇచ్చారు.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10

1. శ్రీరాముడి పాదధూళితో శాపవిముక్తురాలైంది ఎవరు?
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని ఎవరు చంపారు?
3. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరు?
4. మధుర మీనాక్షి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. చిరంజీవులు ఎంత మంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<