News July 18, 2024
శ్రీలంకతో సిరీస్కు నేడు భారత జట్టు ప్రకటన!

శ్రీలంకతో T20, వన్డే సిరీస్ కోసం భారత జట్టును BCCI ఇవాళ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. హార్దిక్, బుమ్రా, కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే T20లకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించనున్నట్లు టాక్. ఈ నెల 27న తొలి T20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది.
Similar News
News January 18, 2026
పెద్దపల్లి: ‘మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ’

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రాజనర్సయ్య వెల్లడించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
News January 18, 2026
రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారింది: మాజీ మంత్రి

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.
News January 18, 2026
నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


