News July 18, 2024

T20 కెప్టెన్సీపై కొనసాగుతున్న సస్పెన్స్!

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త కెప్టెన్, శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపికపై కోచ్ గంభీర్ బీసీసీఐ సెక్రటరీ జైషాతో చర్చించారు. ముఖ్యంగా టీ20 జట్టుకు సారథిగా సూర్యకుమార్‌ను నియమించాలని కోచ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని షా భావిస్తున్నారట. అందుకే కెప్టెన్సీపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదని జాతీయ మీడియా పేర్కొంది.

Similar News

News March 23, 2026

హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

image

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.

News March 23, 2026

మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

image

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.

News March 23, 2026

ఈ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య: మాజీ CIA

image

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొనితెచ్చుకున్న సమస్య అని మాజీ CIA లియోన్ పనెట్టా విమర్శించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందని తెలిసినా ట్రంప్ యంత్రాంగం ముందస్తు ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి దిగిందని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్ బలహీనపడకపోగా మరింత కఠినమైన నాయకత్వం చేతుల్లోకి వెళ్లిందని విశ్లేషించారు. USలో పెరుగుతున్న ఇంధన ధరలు, 59% ప్రజల వ్యతిరేకత ట్రంప్‌ను ఇరకాటంలో నెట్టాయన్నారు.