News July 18, 2024
ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. దీంతో బుధవారం కాటన్ బ్యారేజీ 175 గేట్లను 20 మి.మీ. మేర పైకెత్తి 93,244 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. వ్యవసాయ అవసరాలకు డెల్టా కాలువలకు 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అలాగే కాటన్ బ్యారేజీ వద్ద 10.65 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.
Similar News
News January 12, 2026
తూ.గో: ఇనుపరాడ్తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వీరయ్యగౌడ్ వెల్లడించారు.
News January 12, 2026
తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్కు హాజరుకావాలన్నారు.
News January 12, 2026
తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్కు హాజరుకావాలన్నారు.


