News July 18, 2024
మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

AP: శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మొత్తం ఏడు అంశాల్లో ఇప్పటి వరకు నాలుగింటిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.
Similar News
News January 13, 2026
EC షెడ్లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్) షెడ్లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.
News January 13, 2026
రబీ మొక్కజొన్నలో కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News January 13, 2026
IIT హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

<


