News July 18, 2024

గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్

image

బెంగళూరు పర్యటనను ముగించుకొని మాజీ సీఎం జగన్ గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్‌కు విమానాశ్రయంలో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.

Similar News

News March 5, 2026

పాత సామాన్ల కొట్టులా మచిలీపట్నం GGH

image

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (GGH) అధికారుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. చిన్నపాటి మరమ్మతులు ఉన్న బెడ్లు, పాత ఇనుప సామాన్లను పక్కకు తొలగించకుండా ఓపీ నుంచి సర్జికల్ వార్డులకు వెళ్లే ప్రధాన మార్గంలోనే కుప్పగా వదిలేశారు. దీంతో రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News March 5, 2026

కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

image

కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలకి నెలకు రూ.15-20 లక్షలు ముట్టజెప్పి వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 300 టన్నులకు పైగా పేదల బియ్యం నల్ల బజార్‌కి వెళ్తున్నాయి. స్థానిక మిల్లులోనే పాలిష్ పట్టి సాధారణ బియ్యంలా కాకినాడ పోర్టుకి తరలిస్తున్నట్లు సమాచారం. MTM, పామర్రు,పెనమలూరు కేంద్రాలుగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్నా.. అధికారుల దాడులు మమ అనిపించేలా ఉంటున్నాయి.

News March 5, 2026

కృష్ణా: అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు

image

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.