News July 18, 2024
NZB: కలెక్టర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 2022 ఆగస్టులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లింపులో కాలయాపన జరుగుతోందని వరంగల్కు చెందిన పౌర హక్కుల సంఘం ప్రతినిధి బక్క జడ్సన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ కమిషన్ జిల్లా కలెక్టర్కు సమన్లు జారీ చేసిందని జడ్సన్ తెలిపారు.
Similar News
News October 7, 2024
నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.
News October 7, 2024
కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.
News October 7, 2024
మోస్రా: చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిలు(46) అప్పులు తీసుకున్నాడు. కాగా, అవి ఎలా తీర్చాలో అర్థం అవ్వక మానసింకంగా కుంగిపోయేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది చెరువులో దూకి సూసైడ్ చేసుకునట్లు తెలిపారు.తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.