News July 18, 2024

ఆంధ్ర కేసరి వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆచార్య DVR మూర్తి

image

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం(ఒంగోలు) ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఏయూ జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యులు డీవీఆర్ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆచార్య మూర్తి ఏయూ పరీక్షలు విభాగం డీన్‌గా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన విదేశీ భాషలు విభాగాధిపతిగా, జర్మన్ సెంటర్ డైరెక్టర్, జర్నలిజం విభాగాధిపతిగా, బిఓఎస్ ఛైర్మన్‌గా పదవులు నిర్వహించారు.

Similar News

News July 7, 2025

ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News July 7, 2025

ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ ఎవరో తెలుసా?

image

1972లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. తొలి కలెక్టర్‌గా కత్తి చంద్రయ్య వ్యవహరించారు. నాగులుప్పులపాడు(M) పోతవరంలో 1924 జులై 7న ఆయన జన్మించారు. మద్రాసులో లా పూర్తి చేసి మధురై జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు కలెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు, కుమార్తె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర సైతం IASలే. తండ్రి, కుమారుడు ఒకే జిల్లా(గుంటూరు)కు కలెక్టర్‌గా పనిచేయడం మరొక విశేషం.

News July 6, 2025

ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

image

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.