News July 18, 2024

ఆ అధికారుల్ని సస్పెండ్ చేయండి: రఘురామ

image

AP: తనపై హత్యాయత్నం చేసిన CID అధికారుల్ని సస్పెండ్ చేయాలని MLA రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. ‘నా ఫిర్యాదు మేరకు CID మాజీ డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికి గుంటూరు ఎస్పీని కలిశారు. నా దగ్గర ఉన్న సమాచారం అందించాను’ అని తెలిపారు. కాగా గతంలో ఓ కేసులో తనను అరెస్ట్ చేసి చంపడానికి యత్నించారని రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 27, 2026

విజయ్ ‘జననాయకుడు’ సినిమాకు షాక్

image

హీరో విజయ్‌ నటించిన జననాయకుడు సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న సింగిల్‌ బెంచ్ తీర్పును మద్రాస్ HC చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. వివాదాన్ని మళ్లీ అక్కడే తేల్చుకోవాలని మేకర్స్‌ను ఆదేశించింది. CBFC ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మేకర్స్ HCకి వెళ్లారు. దీంతో సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్‌ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై బోర్డు DIV బెంచ్‌కు వెళ్లింది.

News January 27, 2026

వంటింటి చిట్కాలు

image

* వంటకాల్లో ఉల్లి వాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వేయించే ముందు పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * కలిపిన చపాతీ పిండిపై తడిబట్టను కప్పితే అది ఎండిపోకుండా ఉంటుంది. * పెరుగు పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి. * మొక్కజొన్నలు ఉడికించేప్పుడు చెంచా నిమ్మరసం చేరిస్తే రంగు మారకుండా ఉంటాయి.

News January 27, 2026

భారత్‌తో డీల్‌కు కెనడా ఆసక్తి!

image

భారత్‌తో బిజినెస్ డీల్‌కు కెనడా కూడా ఆసక్తి చూపుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆ దేశ PM కార్నే భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలపై సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌తో యూరోపియన్ యూనియన్‌ బిగ్ డీల్ చేసుకుంది. దీనిపై ఇవాళ ప్రధాని మోదీ, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ప్రకటన చేయనున్నారు. మనదేశంపై భారీగా టారిఫ్స్ వేసిన ట్రంప్‌కు ఈ డీల్స్‌తో సమాధానం చెప్పే అవకాశం లభించింది.