News July 18, 2024
అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ: జనసేన

అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ జరుగుతుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విశాఖలో పౌర గ్రంథాలయంలో జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను రక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
Similar News
News November 14, 2025
విశాఖ: 2300 మందితో భద్రత

విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా సుమారు 2300 మంది(8 మంది ఐపీఎస్ అధికారులు, 8మంది ఏడీసీపీలు, 32 మంది ఏసీపీలు, 89 సీఐలు, 192 ఎస్.ఐలు, 2000(ఏ.ఎస్.ఐ,హెచ్.సి,పి.సి, హెచ్.జి)సిబ్బందితో సదస్సుకు పకడ్బందీగా భద్రతా భద్రతా ఏర్పాట్లు చేశారు.
News November 13, 2025
విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. అక్కడ నుంచి గవర్నర్ విడిది కేంద్రానికి వెళ్లారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నగరానికి చేరుకున్నారు.
News November 13, 2025
రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.


