News July 19, 2024

సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి: NGKL SP

image

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.

Similar News

News March 25, 2026

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 25, 2026

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 25, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.