News July 19, 2024
మెదక్: ‘సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి’

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.
Similar News
News August 27, 2025
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ హెచ్చరిక

ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో యాంటీ-ర్యాగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు.
News August 26, 2025
మెదక్ జిల్లాకు వర్ష సూచన.. కలెక్టర్ అల్టర్

జిల్లాలో రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంతెనలు, వాగులు, చెరువులు, నీటి మునిగే ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించారు.
News August 25, 2025
మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.