News July 19, 2024

కరీంనగర్: 1,30,709 మంది రైతుల రుణమాఫీ

image

పంట రుణమాఫీ నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 1,30,709 మంది రైతులకు రూ.688.44 కోట్ల పంట రుణమాఫీ నిధులు రానున్నాయి. ఇందులో కరీంనగర్‌‌లో 37,745 మంది రైతులకు రూ.194.64 కోట్ల నిధులు, జగిత్యాలలో 39,253 మంది రైతులకు రూ.207.99 కోట్లు, పెద్దపల్లిలో 29,725 రైతులకు రూ.149.43 కోట్లు, సిరిసిల్లలో 23,986 మంది రైతులకు రూ.136.36 కోట్ల నిధులను విడుదల చేశారు.

Similar News

News August 27, 2025

కరీంనగర్: ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం

image

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో 2024-25 ఆర్థిక సం.కి సంబంధించి 4వ త్రైమాసికంలో, 2025-26 ఆర్థిక సం.మొదటి త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రెండు త్రైమాసికాలకు గాను 57మంది ఉద్యోగులు, 2 బస్ స్టేషన్లకు అవార్డులు ప్రదానం చేశారు. KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం ఉద్యోగులకు అవార్డులు అందించారు.

News August 27, 2025

కరీంనగర్: పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మంజూరైన 22 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 22 మహిళా బోధకులు, 22 మహిళా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని తెలిపారు. బోధకులకు ఇంటర్, ఆయాలకు 7వ తరగతి అర్హత అని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28న దరఖాస్తులను కరీంనగర్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News August 26, 2025

మానకొండూర్: కవ్వంపల్లికి బండి సంజయ్ పరామర్శ

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కవ్వంపల్లి ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనను పరామర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా బండి సంజయ్‌తోపాటు ఉన్నారు.