News July 19, 2024
ఏసీబీకి చిక్కిన మత్స్యశాఖ అధికారి

సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 25వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సోసైటి సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారలకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 21, 2026
నల్గొండ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. 2025-26 సంవత్సరానికి గానూ బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షలకు 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
News January 21, 2026
NLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు భేష్

జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో సాగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక కొనుగోలు విధానం రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు జరగడం వల్ల రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై విశ్వాసం పెరిగింది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
News January 21, 2026
NLG: ఆరేళ్లు గడిచినా.. ఎన్నికల లెక్కలు చెప్పలే!

జిల్లాలో గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన 548 మంది అభ్యర్థులు నేటికీ ఎన్నికల ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించలేదు. జిల్లాలోని నకిరేకల్ మినహా నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూర్, చిట్యాల మున్సిపాలిటీలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 707 మంది పోటీ చేశారు. వీరిలో 159 మంది మాత్రమే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పించారు.


