News July 19, 2024
HYD: హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.21 మీటర్లు..!

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News August 26, 2025
HYD: అంతర్జాతీయ పోటీల్లో ‘FIRE’ కానిస్టేబుల్

HYD అగ్నిమాపక కానిస్టేబుల్ అవుల నరసింహ, ఐసీఎన్ ప్రో కార్డ్ గెలుచుకుని అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు అర్హత సాధించారు. ‘Mr. Fit Cop’గా పేరుగాంచిన నరసింహ, తన వృత్తిని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఘనతతో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నరసింహను పలువురు అభినందించారు.
News August 26, 2025
ఉత్సవాలకు ముందే.. HYDలో తొలి విగ్రహం నిమజ్జనం

వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్సాగర్లో నిమజ్జనం జరిగింది. దోమల్గూడకు చెందిన మండప నిర్వాహకులు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్నగర్లో కేబుల్స్కు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ఆ విగ్రహాన్ని పీపుల్స్ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.
News August 26, 2025
HYD: క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

కూకట్పల్లిలో సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడి వద్ద లభించిన లెటర్తో సహస్ర హత్యకు సంబంధం లేదని విచారణలో తేలింది.