News July 19, 2024
జన్నారం: ‘నాకు రుణమాఫీ కాలేదు’

జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన చిందం రాజమౌళి అనే రైతుకు ఇందంపల్లి గ్రామీణ బ్యాంకులో రూ.45 వేల అప్పు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేసిన లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రెస్ కార్యాలయానికి వచ్చి మీడియాకు తన గోడును వినిపించాడు. అర్హతలు ఉన్నప్పటికీ మాఫీ కాలేదన్నారు.
Similar News
News March 13, 2025
ADB: కామదహనం ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్న ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు చేసుకుంటారు. వాటిని వెదురుతో అంటించిన మంటల్లో పెట్టి పోటీలు నిర్వహిస్తారు.
News March 13, 2025
ఆదిలాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2025
ఇంద్రవెల్లి: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.