News July 19, 2024

రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5కోట్లు: CBN

image

AP: ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News January 28, 2026

80 గంటల్లో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

image

మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబరులో ఏర్పాటైన ’80 గంటల ప్రభుత్వం’ అజిత్ పవార్‌కు రాజకీయాలలో కీలక ఘట్టం. నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి Dy.CMగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 Hrsలోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి NCPకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

News January 28, 2026

ఈయూతో డీల్.. భారత్ సాధించిన గొప్ప విజయం: US ట్రేడ్ ప్రతినిధి

image

ఇండియా-EU మధ్య కుదిరిన <<18973407>>ఒప్పందం<<>>పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసలు కురిపించారు. ‘డీల్‌‌లోని కొన్ని అంశాలు చదివాను. ఇండియాకు అనుకూలంగా కనిపిస్తోంది. యురోపియన్ మార్కెట్లో విస్తృత అవకాశాలు దక్కుతాయి. డీల్ అమల్లోకి వచ్చాక ఆ దేశానికి గొప్ప విజయంగా నిలవబోతోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత వర్కర్లు యూరప్‌కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు.

News January 28, 2026

వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.