News July 19, 2024

భీమ్గల్: గుండెపోటుతో విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మహీషా(16) రోజులాగే స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలిక అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

Similar News

News August 26, 2025

NZB: కొండెక్కిన పూల ధరలు

image

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

News August 26, 2025

NZB: ఐటీఐలో స్పాట్ అడ్మిషన్ గడుపు పొడగింపు

image

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్స్‌లలో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.

News August 26, 2025

భీమ్‌గల్: అంకం జ్యోతి ఫౌండేషన్‌కు డాక్టరేట్

image

భీమ్‌గల్‌కి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్‌కు వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాక్టర్ జ్యోష్ణ, రవి చేతుల మీదుగా ఫౌండేషన్ డైరెక్టర్ జ్యోతి అవార్డ్ అందుకున్నారు. 15 ఏళ్ల నుంచి పేద ప్రజలకు, వృద్ధులకు సహాయం చేస్తూ 3 సార్లు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని జ్యోతి తెలిపారు.